హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సదరు వ్యక్తులను మధ్యప్రదేశ్కు చెందిన తోమర్ సింగ్, మహారాష్ట్రలోని ముంబై వాసి సురేష్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.