లక్నో : దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందక నిత్యం పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రాణవాయువు అందక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలోని పిల్లల దవాఖానలో చోటు చేసుకుంది. స్థానిక రెండు పిల్లల దవాఖానలు ఉన్నాయి. వాటికి ఆక్సిజన్ సరఫరా చేయలేనందున గత రాత్రి జన్మించిన ఇద్దరు కవలలు కన్నుమూశారు. ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేదని ప్రకటించారు. ఆక్సిజన్ సరఫరాపై సరైన పర్యవేక్షణ కోసం ఐఐటీ కాన్పూర్, ఐఐఎం లక్నో, ఐఐటీ బీహెచ్యూల ఆధ్వర్యంలో ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, పంపిణీకి ప్రత్యక్ష ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఇవికూడా చదవండి..