డెహ్రాడూన్ : నిరంజనీ అఖాడా మనీష్ భారతికి చెందిన శ్రీ మహంత్ (49) కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆయన రిషికేశ్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఈ నెల 15న కరోనా పాజిటివ్గా పరీక్షించగా.. చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. అలాగే అదే అఖాడాకు చెందిన లఖన్ గిరి సైతం వైరస్ బారినపడి కన్నుమూశారు. దీంతో ఇప్పటి వరకు ఆరుగురు సాధువులు కుంభమేళాకు హాజరైన అనంతరం కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.
నిరంజని అఖాడా ఆఫీస్ బేరర్స్ వివరాల ప్రకారం.. లఖన్ గిరి (95) శ్రావణ్ నాథ్ మఠం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అఖాడాకు చెందిన ముగ్గురు సాధువులు మృతి చెందగా.. మిగతా వారిని భయాందోళనలకు గురి చేసిందని నిరంజనీ అఖాడా ఒక ప్రకటనలో పేర్కొంది. హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే ఝా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ అఖాడాల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 250 మంది సాధువులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారని పేర్కొన్నారు.