హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీంతో నిఘా పెట్టిన పోలీసులు సోమవారం డ్రా నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కొంత నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్కీడ్రాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.