హైదరాబాద్ : కారు – ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో బుధవారం జరిగింది. అక్కరాజుపల్లి స్టేజీ వద్ద కారు-బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మృతులను తరిగొప్పులకు చెందిన వెంకటయ్య (51), ప్రవీణ్ (22)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.