అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగిందిక. జిల్లాలోని పంగలూరు మండలం జాగర్లమూడిపాలెం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం దాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను కారులో నుంచి బయటకు తీశారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. చెన్నైనుంచి చిలకరూలి పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.