రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరాన్గఢ్ ఏరియాలో ఓ ఏనుగు ఇద్దరు వ్యక్తులను దాడి చేసి చంపింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఆడ ఏనుగు దాని పిల్లతో కలిసి సరాన్గఢ్ ఏరియాలోకి నివాస ప్రాంతాల్లో వచ్చింది. దాంతో స్థానికులు చప్పుళ్లతో, కర్రలతో దాన్ని పారదోలేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తల్లి ఏనుగు ఒకవైపు, గున్న ఏనుగు మరో వైపు విడిపోయాయి. అయితే బిడ్డ తన నుంచి దూరం కావడంతో ఆగ్రహానికి లోనైన తల్లి ఏనుగు జనంపై ఎదురుదాడి చేసింది. ఈ సందర్భంగా తనకు చిక్కిన ఇద్దరు వ్యక్తులను తొండంతో నేలకు కొట్టి చంపింది.
ఏనుగు దాడికి సంబంధించిన సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, అటవీ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. విడిపోయిన తల్లీపిల్లలను ఒకచోటకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.