శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లా (Baramulla) జిల్లా సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సోపోర్ టౌన్లోని బొమై ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పులు ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని జమ్ము డీఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో సాధారణ పౌరుడు గాయపడ్డాడని అతడిని దవాఖానకు తరలించామన్నారు.
హతులను జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మహ్మద్ రఫి, కైసర్ ఆశ్రఫ్గా గుర్తించామన్నారు. రఫిపై ఇప్పటికే రెండుసార్లు పీఎస్ఏ కింద కేసులు నమోదయ్యాయని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం సోపియాన్ జిల్లాలోని నక్బాల్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. మృతుల్లో డానిష్ భట్ అనే సీరియల్ కిల్లర్ కూడా ఉన్నాడు. వారిని లష్కరే తొయిబాకు చెందినవారిగా గుర్తించారు.
Killed JeM terrorists were categorised &identified as MohdRafi of Sopore & KaiserAshraf of Pulwama. Terrorist Rafi was earlier booked underPSA twice. Both were involved in several terror crime cases. As per input they were planning to attack civilians in Sopore area: ADGP Kashmir https://t.co/n0JY0CLlXt
— Kashmir Zone Police (@KashmirPolice) August 31, 2022