లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గోండాలోని తిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో రెండు ఇండ్లు కూలిపోగా.. ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సంతోష్కుమార్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 14 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.