అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,26,289 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,22,435 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.70 అడుగుల వరకు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని వివరించారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 19,203, ఔట్ఫ్లో 17,108 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.99 టీఎంసీలకు వరకు నీరు నిల్వ ఉంది.