ఎంపీ సంతోష్కుమార్ ఆదేశాలతో చర్యలు
హుజూరాబాద్ టౌన్, మార్చి 5: హరితహారంలో నాటిన మొక్క ధ్వంసానికి కారకులైన ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమా నా విధించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లో మూడేండ్ల క్రితం సేవ్ ద ట్రీస్ ఆధ్వర్యంలో మొ క్కలు నాటారు. ఇందులో ఓ మొక్క ధ్వంసమైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా కరీంనగర్ కలెక్టర్కు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ టీచర్ రమేశ్, పీఈటీ నాగేశ్వర్రావులకు కలిపి రూ.2వేల జరిమానా విధించారు.