మంచిర్యాల : ప్రమాదవశాత్తు కరెంట్షాక్కు గురై నిర్మాణంలో ఉన్న ఇంటి యజమానితో పాటు పనికి వచ్చిన కూలీ మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీలో మంగళవారం చోటుచేసుకుంది. మృతులు ఇంటి యజమాని సముద్రం(55), కూలీ కొండ వెంకటేశ్(33). ఐరన్ రాడ్స్ను బిగిస్తుండగా ఇంటిపై నుంచి వెళ్లే హై టెన్షన్ కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. వెంకటేశ్ అవివాహితుడు కాగా సముద్రానికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.