పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎక్లాస్పూర్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఖాన్సాయిపేటకు చెందిన జక్కుల కుమార్ స్వామి, పేరాల విమలగా గుర్తించారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.