పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. మహారాష్ట్ర నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.