హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్నగర్లోని నారాయణ నిలయంలో గురువారం చోరీ చేశాడు. ఎస్ అవినాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన అహ్మద్.. రూ. 1.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించాడు.
తమ్మిశెట్టి రామ్ అనే మరో దొంగ కూడా మూడు రోజుల క్రితం సనత్నగర్లోనే చోరీకి పాల్పడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను అరెస్టు చేశారు. రామ్ నుంచి రూ. 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నాడు.