అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లా వి. కోట మండలం పాపేపల్లిమిట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకుప్పం, వి. కోట, బంగ్లా గ్రామాలకు చెందిన దుర్గ(25) , గంగాధర్ (24), వినయ్కుమార్(26) అనే యువకులు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.