ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వర రావు శుక్రవారం ఉదయం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. ఆయనతోపాటు మరో నిందితుడు ఏ10 నాగయ్య కూడా ఉన్నారు.
టీఆర్ఎస్ నేత కృష్ణయ్య గత నెల 15న దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యానంతరం ఏ9 గా ఉన్న తమ్మినేని కృష్ణయ్య కోటేశ్వర రావు, ఏ10 నాగయ్య పరారీలో ఉన్నారు. తాజాగా వారు కోర్టులో లోంగిపోయారు.