హైదరాబాద్ : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి లకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జే.కైలాసం, నూతనకంటి బాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిలకు టీయూటీఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వీరి గెలుపుకు టీయూటీఎఫ్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.