కాబూల్: ఈ నెల 24 న ఇస్తాంబుల్లో శాంతి సమావేశం నిర్వహించేందుకు టర్కీ సిద్ధమవుతున్నది. అయతే, విదేశీ సైన్యాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతనే శాంతి చర్చల్లో పాల్గొంటామని తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నది.
సెప్టెంబర్ 11 న అమెరికాలోని జంట టవర్లపై దాడి చేసిన 20 వ వార్షికోత్సవానికి ముందు యుఎస్ దళాలు ఉపసంహరించుకుంటాయని మంగళవారం అమెరికా తాలిబాన్లకు సూచించింది. దాంతో ఈ సిగ్నల్ రాగానే తాలిబాన్ ప్రత్యక్ష హెచ్చరిక జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశీ బలగాలను ఉపసంహరించుకునే వరకు శాంతి చర్చలు జరగవని తాలిబాన్ ప్రతినిధి ముహమ్మద్ నయీమ్ వర్దక్ అన్నారు.
అంతకుముందు, టర్కీలోని ఇస్తాంబుల్లో ఏప్రిల్ 24 న ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన అన్ని పార్టీలతో చర్చలు ప్రారంభమవుతాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. చర్చలు మే 4 వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ చర్చలలో ఆఫ్ఘనిస్తాన్ తన ప్రమేయాన్ని ధ్రువీకరించింది. కాని తాలిబాన్ పాల్గొనడం ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదు.
ఆప్ఘనిస్తాన్లో నాటో దళాల ఉపసంహరణ యూఎస్ ఆర్మీతో కూడా ఉంటుందని అమెరికా తెలిపింది. ప్రస్తుతం, ఆఫ్ఘనిస్తాన్లో ఏడున్నర వేల యూఎస్ దళాలతో పాటు ఏడు వేల యూఎస్ యేతర దళాలు ఉన్నాయి.
ఐక్యరాజ్య సమతి నివేదిక ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ హింసలో సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 573 మంది పౌరులు మరణించారు. 1210 మంది గాయపడ్డారు. మరణించిన వారి సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగింది.
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..