హైదరాబాద్ : టీటీడబ్ల్యూఆర్జేసీ సెట్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్-19 కేసుల పెరుగదల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీటీడబ్ల్యూఆర్జేసీ సెట్ పరీక్షను వాయిదా వేసింది. టీటీడబ్ల్యూఆర్జే కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏప్రిల్ 11వ తేదీన పరీక్ష నిర్వహించతలపెట్టారు. కాగా తాజా ఆదేశాలతో తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు పరీక్షను వాయిదా వేశారు.