TTD | అక్టోబర్ నెలకు చెందిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 24న బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. అలాగే మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియను అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. కాగా, అక్టోబరు మాసానికి సంబంధించి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి, శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని కోరింది.