తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబరు నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో ఉదయం 9గంటలకు అందుబాటులో ఉంచనున్నది. రోజుకి 8వేల చొప్పున టిక్కెట్లును విడుదల చేయనుంది. ఉచిత సర్వదర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.