అమరావతి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను సైతం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ పేర్కొంది. కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులకు ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.