తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.
కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వ తేదీల మధ్య వరకు వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు బుకింగ్ తేదీ నుంచిసంవత్సరంలోపు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని టిటిడి కోరింది.