తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నా ఇవాళ స్వామి వారి
హుండీ ద్వారా రూ.5 కోట్ల 21 లక్షలు కానుకలుగా భక్తులు సమర్పించారు.
గతంలో 2012 ఏఫ్రిల్ 1వ తేదిన స్వామివారికి అత్యధికంగా 5.73 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మళ్లీ ఆ స్థాయిలో స్వామివారికి లభించిన అత్యధిక హుండీ ఆదాయం ఇదే కావడం గమనార్హం.