తిరుమల, జూన్ 13:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది.ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో చివరిరోజైన జూన్ 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేసింది. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టానక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.