హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుల ఎంపికపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి రెండోసారి అవకాశం ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దృష్టి కమిటీ సభ్యులపైనే పడింది. సభ్యుల ఎంపిక ఇప్పటికే పూర్తవగా.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 మంది రెగ్యులర్ సభ్యులతో పాలకమండలితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కొనసాగనున్నారు. అయితే, ఈ సారి 50 మందికి ప్రత్యేక ఆహ్వానితులగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. విధానపరమైన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి ప్రమేయం ఉండబోదని తెలుస్తోంది.
తెలంగాణ కోటా నుంచి పదవి మందికి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం పలువురికి పాలక మండలిలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తం 75 మంది సభ్యులతో పాలక మండలి ఉండనున్నట్లు సమాచారం. అయితే, బోర్డు సభ్యుల కోసం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తున్నాయని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కోసం ఏకంగా తొమ్మిది మంది కేంద్రమంత్రులు సిఫారసు ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జాబితాపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలోనే టీటీడీ పాలకమండలిపై చర్చించి, ఆ తర్వాత జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.