తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం ప్రక్రియను చేపట్టేందుకు టీటీడీ బోర్డు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. తిరుమల స్వామివారితోపాటు అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే వస్త్రాలను ఈ-వేలం వేయడం ఆనవాయితీగా వస్తున్నది. టీటీడీ వద్ద ప్రస్తుతం 149 లాట్ల వస్త్రాలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వస్త్రాల ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇందులో పాలిస్టర్ నైలాన్ / నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్పీస్లు కొత్తవి, వినియోగించినవి ఉన్నాయని టీటీడీ తెలిపింది. ఆసక్తి గల పార్టీలు మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయంలోగానీ, 0877-2264429 ఫోన్ నంబర్లోగానీ కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org వెబ్సైట్ను సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.