తిరుమల,జూలై 2: తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా, ప్రొఫెషనల్ గా నిర్వహించే ఏజెన్సీలను ఆహ్వానించింది టిటిడి. వీటిలో బెంగుళూరుకు చెందిన కెవిఎం ఎన్ఫో అతి తక్కువ ధరకు టెండరు వేసింది. ఇకపై తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కల్యాణ కట్ట తలనీలాలు సమర్పిచే భక్తులకు టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనం టికెట్లు స్కానింగ్ కౌంటర్లు, తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్లు, అలిపిరి టోల్గేట్ వద్ద ఉన్న కౌంటర్లు కెవిఎం ఎన్ఫో ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు.