హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచి రాష్ర్ట సాధనలో భాగస్వాములైన ఆర్టీసీ ఉద్యోగుల కు కేసీఆర్ శుభవార్త వినిపించారు.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిది. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని కాపాడుతున్నాం. బడ్జెట్లో రూ. 3000 కోట్లు కేటాయించాం. ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతాం. రవాణా శాఖ మంత్రితో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రాష్ర్టంలో లాక్డౌన్ విధించం : సీఎం కేసీఆర్
జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు శుభవార్త
పాలమూరును అన్నపూర్ణ జిల్లాగా మారుస్తాం : మంత్రి హరీష్ రావు