హైదరాబాద్ : తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పులను సరిదిద్దుకునేందుకు మరో నాలుగు రోజులు గడువు ఇచ్చింది. ఇంతకు ముందు ఈ నెల 13తో గడువు ముగుస్తుందని ప్రకటించగా.. దాన్ని అభ్యర్థుల వినతి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ మంగళవారం పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.