హైదరాబాద్ : వివిధ ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ మంగళవారం వెల్లడించింది. ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 20 మంది, తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 75 మంది ఎంపికైనట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. అదేవిధంగా పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు ఏడుగురు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది.