హైదరాబాద్: పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పాలిసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కౌన్సెలింగ్కు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఈ నెల 5 నుంచి 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. 6వ తేదీన ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తారని తెలిపారు. 8వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. 8, 9వ తేదీల్లో సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. తదితర వివరాల కోసం https://tspolycet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.