హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐ-పాస్ అమలులోకి వచ్చిన 2015 నుంచి 2022 జనవరి వరకు రాష్ట్రంలో 18,761 పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరుచేశారు. ఈ కాలంలో మొత్తం రూ.2,26,806 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. ఆయా యూనిట్లలో 16.32 లక్షల మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రభుత్వం విడుదలచేసిన సామాజిక, ఆర్థిక సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఎక్కువ యూనిట్లు ఏర్పాటైన రంగాలు:
ఇంజినీరింగ్ (అత్యధికం), ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సిమెంట్, సిమెంట్-కాంక్రీట్ ఉత్పత్తులు, గ్రానైట్, స్టోన్ క్రషింగ్ యూనిట్లు.
ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రంగాలు:
థర్మల్ పవర్ప్లాంట్లు (అత్యధికం), ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ బిల్డింగులు, సోలార్, ఇతర సాంప్రదాయేటత ఇంధన ప్రాజెక్టులు, ఔషధాలు, కెమికల్స్, ఎరువుల పరిశ్రమలు.
ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించిన రంగాలు:
ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ రంగం ద్వారా అధికంగా ఉద్యోగాలు లభించాయి. వస్త్ర పరిశ్రమ, ఔషధాలు, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ రంగాలు కూడా ఉపాధి కల్పనలో ముందున్నాయి.