హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్-2022 (TS ICET) పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ప్రొఫెసర్ రమేశ్ విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https:// icet.tsche.ac.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 మంది హాజరుకాగా, 7171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.