హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం (అక్టోబర్ 22న) విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు. అధికారిక సమాచారం ప్రకారం ఐసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నది.
ఐసెట్ ద్వారా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. ఈఏడాది ఐసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 75,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు