హైదరాబాద్ : టీఎస్ డీఈఈ సెట్-2022 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 2022-24 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాల నిమిత్తం.. జులై 23న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలను గురువారం నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
తెలుగు మీడియంలో 77.40 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 78.81 శాతం, ఉర్దూ మీడియంలో 59.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో మోర్లె మురళి అత్యధికంగా 65 మార్కులు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో మీర్జా మహ్మద్ ఇర్షాద్ బేగ్ 77 మార్కులు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచారు. ఉర్దూ మీడియంలో ఉమేరా ప్రవీణ్ 78 మార్కులు సాధించి, ప్రథమస్థానంలో నిలిచారు.