ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ, వివక్షకు గురిచేస్తోందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ మండిపడ్డారు. ముందు దీని గురించి తగిన సమాధానం చెప్పిన తరువాతే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సంగ్రామ యాత్రను చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకుని ప్రశ్నిస్తామని హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్హౌజ్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సతీశ్ మాట్లాడుతూ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా కేంద్రం అమలుచేయడం లేదని దుయ్యబట్టారు. దేశంలోని యువతను నిరుద్యోగులుగా మారుస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్న కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు తెలంగాణకు మంజూరు చేయించిన అభివృద్ధి పనులు, నిధుల గురించి చెప్పా లన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్తో సహా పలు సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, కార్పొరేట్ వ్యక్తులను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క సైనిక్స్కూల్ను అయినా తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. నూతన జిల్లాల కోసం నవోదయ పాఠశాలలను స్థాపించాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను ఎందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా ఏ ముఖం పెట్టుకుని యాత్రకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. తన నోటిని అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు గదరాజు చందు, జిల్లా నాగయ్య, శ్రీకాంత్గౌడ్, మేకల రవి, ప్రశాంత్, బాలకృష్ణ, రమేశ్, కృష్ణ, రేణు, లింగరాజు, శ్రీనునాయక్, జానయ్య, గోపి, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.