మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకపోయారు. ఖాళీ అయిన స్థానాలకు మంగళవారం హయత్నగర్లో ఎన్నికలు నిర్వహించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటించారు. డైరెక్టర్లుగా టీఆర్ఎస్ నుంచి ముగ్గురు గెలిచారు. తనను కలిసిన కొత్త డైరెక్టర్లకు మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలు తెలిపారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మదర్డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన బరిలో నిలిచిన మూడు డైరెక్టర్ స్థానాలకు ఎదురులేని విజయం సాధ్యమైంది. టెస్కాబ్ వైస్చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సారథ్యంలో ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రుణాలు, పాల ధరల పెంపు తదితర సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి హామీలు సుడిగాలిలో కలిసిపోయాయి.
డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి సారథ్యంలో..
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రి జగదీశ్రెడ్డి బిజీగా ఉండడంతో మదర్ డెయిరీ ఎన్నికల బాధ్యతలను డీసీసీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డికి అప్పగించారు. మంత్రి పర్యవేక్షణ, మహేందర్రెడ్డి సారధ్యం వహించారు. ప్రతి పోల్కు కనీసం ఛాన్స్ ఇవ్వకుండా చక్రం తిప్పారు. మూడుసీట్లు సులభంగా గెలిచే వ్యూహాలు పన్ని విజయవంతమయ్యారు.
నేడు చైర్మన్ ఎన్నిక..
ఖాళీ అయిన స్థానాలకు ఎన్నిక జరుగడంతో ఇక మదర్డెయిరీ చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంది. బుధవారం హయత్నగర్లో చైర్మన్ ఎ న్నిక జరుగనుంది.. ఇప్పటికి ఉన్న 12 మం ది డైరెక్టర్లతో పాటు, తాజాగా ఎన్నికైన డైరెక్టన్లు చైర్మన్ను ఎన్నుకోనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి జగదీశ్రెడ్డి అభినందన
నార్మాక్స్కు ఎన్నికైన డైరెక్టర్లుగా మంత్రి జగదీశ్ రెడ్డి అభినందించారు. టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు, తాజా పాలకవర్గం హైదరాబాద్లో మంగ ళవారం మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లను మంత్రి అభినందించారు.