మెథడిస్ట్ చర్చి ప్రార్థనల్లో పాస్టర్ల ఆశీర్వచనం
అమీర్పేట్, మార్చి 7: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ఆదివారం ఉదయం హైదరాబాద్ సనత్నగర్ మార్లిన్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు రత్నం, రాజగోపాల్, దేవీదాస్లతోపాటు టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు దయాకర్ తదితరులు వాణీదేవికి ఘనస్వాగతం పలికారు. అనంతరం చర్చి పాస్టర్ అనిల్ నథానియేల్ వాణీదేవికి ఆశీర్వచనాలు పలికారు.