కేంద్రంపై పోరులో భాగంగా ఆందోళన
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి
మహబూబ్నగర్, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని వదిలేదే లేదని తెగేసి చెప్పారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. సోమవారం మండల కేంద్రాల్లో జరిగే నిరసన దీక్షలో పార్టీ నాయకులతోపాటు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొననున్నట్టు చెప్పారు. 6న బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. 7న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష, 8న అన్ని పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి రైతు, టీఆర్ఎస్ కార్యకర్త తమ ఇండ్లపై నల్లా జెండాలు ఎగురవేసి నిరసన తెలుపాలని కోరారు. 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొనేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.