హైదరాబాద్ : మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, ఇందుకు తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు.