చౌటుప్పల్/మిర్యాలగూడ/మునుగోడు/సంస్థాన్నారాయణపురం/మర్రిగూడ/నాంపల్లి, అక్టోబర్ 8: కేంద్రం రూ.18 వేల కోట్ల కాం ట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ టీవీ చర్చా వేదికలో చెప్పడంతో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి రాజగోపాల్రెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావు డి మాండ్ చేశారు. చౌటుప్పల్ బస్టాండ్ కూడలిలో రాజగోపాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మునుగోడులో ప్లకార్డులతో నిరసన తెలిపారు. సంస్థాన్నారాయణపురంలో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాజ గోపాల్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మర్రిగూడలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. చండూరులో ప్లకార్డులు ప్రదర్శిం చారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డివి నీతిమాలిన రాజకీయాలని విమర్శించారు.