ఏకగ్రీవ తీర్మానం
-హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని సింగపూర్ లోని గెస్ట్హౌజ్లో మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు అందజేశారు.
చేరిక
-వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు మంత్రి హారీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
పాలాభిషేకం
-జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో దళిత బందు సర్వే సందర్భంగా దళితులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇంటింటా ప్రచారం
-హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3,18 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.