రేగట్టె కుటుంబానికి టీఆర్ఎస్ నేతల ఓదార్పు
రోడ్డుప్రమాదంలో కుమారుడు దినేశ్రెడ్డిని కోల్పోయిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డిని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలంతా పరామర్శించి ఓదార్చారు. బుధవారం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో అంతిమ సంస్కారాలు జరగ్గా.. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్, నోముల భగత్, ముఖ్యనేతలు హాజరై నివాళులర్పించారు. మంత్రి జగదీశ్రెడ్డి కార్యక్రమం చివరి వరకూ ఉండి రేగట్టె కుటుంబానికి ధైర్యం చెప్పారు.
నార్కట్పల్లి, జూలై 20 : మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు రేగట్టె దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని స్వగృహంలో ఉంచారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మల్లికార్జున్రెడ్డి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నాయకులు, అభిమానులు తరలివచ్చి మల్లికార్జున్రెడ్డిని ఓదార్చారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దినేశ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లికార్జున్రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం అశ్రునయనాల మధ్య దినేశ్రెడ్డి అంతిమయాత్ర జరిగింది.
మంత్రి జగదీశ్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. దినేశ్రెడ్డి అంత్యక్రియలను వారి వ్యవసాయక్షేత్రలో చేశారు. ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్, పైళ్ల శేఖర్రెడ్డి, శాసన మండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చెరుకు లక్ష్మీసుధాకర్, ఆర్డీఓ జగదీశ్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు దినేశ్రెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేగట్టె కుటుంబ సభ్యులను పరా మర్శించి ఓదార్చారు.