కవాడిగూడ, ఆగస్టు 10: ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్కు కంచుకోట అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎప్పు డు ఉప ఎన్నిక వచ్చినా విజయం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. గతం లో ఆ జిల్లాలోని నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో హేమాహేమీలను టీఆర్ఎస్ ఓడగొట్టిందని గుర్తుచేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం ఆమె దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్లో వనమహోత్సవంలో పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఆగలేదన్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు, పెన్షన్ల పంపిణీ నిరాటంకంగా కొనసాగాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.