BRS | తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దసరా శుభఘడియల్లో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ పేరును మారుస్తూ ఇవాళ నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. #TRS #BRS #BRSParty pic.twitter.com/xYKlfJHaqy
— Namasthe Telangana (@ntdailyonline) October 5, 2022