ముషీరాబాద్/చిక్కడపల్లి/కవాడిగూడ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేశారు. ముషీరాబాద్ డివిజన్ పార్శిగుట్ట చౌరస్తా, అడిక్మెట్ టీఆర్ఎస్ కార్యాలయం, రాంనగర్ చౌరస్తాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ముఠా జయసింహ, పలు డివిజన్ అధ్యక్షులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, బి.శ్రీనివాస్రెడ్డి, ఆర్.మోజస్, మాజీ కార్పొరేటర్లు బి.హేమలతారెడ్డి, కె.సురేందర్, ఆకుల అరుణ్, శ్రీధర్రెడ్డి, నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, మల్లికార్జున్రెడ్డి, రవియాదవ్, దీన్దయాల్రెడ్డి, శివముదిరాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా రాంనగర్లో టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నేత ఎడ్ల హరిబాబు యాదవ్ టీఆర్ఎస్ జెండాలను వేర్వేరుగా ఆవిష్కరించారు. మనోహర్సింగ్, సుదేశ్ పాల్గొన్నారు.
ప్రజల కష్టం తెలిసిన పార్టీ..
టీఆర్ఎస్ పార్టీ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన పార్టీగా అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతోపాటు అధికారం చేపట్టి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం, పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. రానున్న రోజుల్లో తమ పార్టీ మరింతగా ప్రజలకు చేరువై అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
చిక్కడపల్లిలో..
గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకుల ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ, మాచర్ల పద్మజ, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, పరశురాం, మారిశెట్టి నర్సింగ్ రావు, గుండు జగదీశ్ బాబు, గడ్డమీది శ్రీనివాస్, ఎస్టీప్రేమ్, రాజ్కుమార్, జి.వెంకటేశ్, సంతోష్, భాస్కర్, రవి శంకర్గుప్తా, సుధాకర్, ముచ్చకుర్తిపద్మ, శివకుమారి, సుధా, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
బాగ్లింగంపల్లిలో..
టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మన్నే దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి కేబీఎన్ పాయింట్ వద్ద టీఆర్ఎస్ జెండాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, పార్టీ నాయకులు వెంకటకృష్ణ(బబ్లూ), ఎ.కిషన్రావు, టెంపుల్ జనార్దన్, శివకుమార్యాదవ్, ముదిగొండ మురళి, ఎంవీ జనార్దన్, కూరగాయల శ్రీను, నితిన్, సాయి, గోక నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య పార్కు చౌరస్తాలో ఆర్.జయదేవ్ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వివేక్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బాగ్లింగంపల్లి చౌరస్తాలో పార్టీ నాయకులు శివకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీని యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, కల్యాణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడలో..
కవాడిగూడలోని ఇందిరాపార్కు వద్ద డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, భోలక్పూర్లోని టి.అంజయ్యనగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద భోలక్పూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, కవాడిగూడలోని కల్పనా థియేటర్ వద్ద బండారి మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు హాజరై ఆవిష్కరించారు. అదే విధంగా భోలక్పూర్ ఎస్బీఐ కాలనీలో జెండాను ఎగుర వేస్తున్న భోలక్పూర్ నాయకుడు బింగి నవీన్ కుమార్ జెండాను ఎగురవేశారు. అనంతరం టి.అంజయ్యనగర్లో తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకురాలు భారతమ్మను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, రాజశేఖర్ గౌడ్, రాంచందర్, కృష్ణ, సురేందర్ గౌడ్, బింగి నవీన్కుమార్, గోవింద్ రాజ్, ముప్పిడి నర్సింగరావు, ప్రవీణ్, శంకర్ గౌడ్, భీమేశ్, మల్లేశ్, రవీందర్, ఉప్పలయ్య, సాయి, ఆర్.శ్రీనివాస్, కృష్ణమూర్తి, వాహెబ్, గోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.