హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): అసత్యాలు ప్రసారంచేస్తున్న రాజ్న్యూస్, కొన్ని యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్కు గురువారం ఫిర్యాదుచేసింది. హుజూరాబాద్లో టీఆర్ఎస్కు ఉన్న ప్రజాభిమానాన్ని దెబ్బతీసేందుకు రాజ్న్యూస్ కావాలనే అసత్యాలు ప్రసారం చేస్తున్నదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గట్టు రాంచందర్రావు ఈసీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఈటలకు వేయమంటున్న హరీశ్రావు’ అనే అసత్య కథనాన్ని ప్రసారం చేసిందని ఫిర్యాదుచేశారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఖాయమైన సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజ్న్యూస్ తప్పుడు కథనాలను, అసత్య కథనాలను ప్రసారం చేసిందని తెలిపారు. తప్పుడు కథనాలను ప్రసారంచేసిన రాజ్న్యూస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సంహిత నెట్వర్క్ అనే యూట్యూబ్ చానల్పై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్షణమే రాజ్న్యూస్, యూట్యూబ్ చానళ్లలో సదరు అసత్య ప్రచార ఫుటేజీని తొలగించడమే కాకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ అసత్య ప్రచారాలకు సంబంధించిన ఆధారాలను ఫిర్యాదుతోపాటు జతచేశారు.