హాలియా: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సాగర్ ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం త్రిపురారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదని చెప్పారు. నోముల భగత్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్తోనే నాగార్జున సాగర్ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఉపయోగం లేదని మంత్రి అన్నారు.
సాగర్లో ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆయన ఈరోజు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పెద్దవూర మండలంలో ప్రచారం నిర్వహించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనన్ని అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. భగత్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..